వికారాబాద్ జిల్లా దోమ మండలంలో బీఆర్‌ఎస్ పార్టీకి షాక్…

* వికారాబాద్ జిల్లా దోమ మండలంలో బీఆర్‌ఎస్ పార్టీకి షాక్…*

*▫️కాంగ్రెస్ పార్టీలో చేరిన దిర్సంపల్లి గ్రామ సర్పంచ్…*

ఇది కద నిజం:దోమ మండలం దిర్సంపల్లి గ్రామ బీఆర్‌ఎస్ పార్టీ సర్పంచ్ విజయలక్ష్మి వెంకట్ రాములు పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే TRR వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అధికార పార్టీలో ఉంటేనే గ్రామాభివృద్ధి వేగంగా సాధ్యమవుతుందని,అలాగే ఎమ్మెల్యే TRR పరిగి నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి పనులపై విశ్వాసంతోనే కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు విజయలక్ష్మి వెంకట్ రాములు ఈ సందర్భంగా తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *